News August 24, 2025
కర్నూలు: కవల పిల్లలకు టీచర్ ఉద్యోగాలు

గూడూరుకు చెందిన వడ్ల రామాంజనేయులు, సరస్వతి దంపతుల కుమారులు(కవలలు) రవితేజ ఆచారి, విష్ణు వర్ధన ఆచారి డీఎస్సీలో ఉత్తీర్ణులై టీచర్ ఉద్యోగాలు పొందారు. రవితేజ ఆచారి 83 మార్కులు, విష్ణు వర్ధన ఆచారి 82 మార్కులు సాధించారు. తమ కుమారులు ఎస్జీటీ విభాగంలో ఉద్యోగాలు సాధించారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు వారిని అభినందించారు.
Similar News
News August 24, 2025
కర్నూలు: పట్టు విడువని విక్రమార్కుడు ఎం. శివప్రసాద్

జిల్లాలోని పెద్దకడబూరుకు చెందిన శివప్రసాద్ DSCలో పట్టు విడువని విక్రమార్కుడిలా పోరాడాడు. DSC ఎస్జీటీలో 83.43 మార్కులతో టీచర్ పోస్ట్లు అర్హత సాధించాడు. గతంలో జరిగిన ప్రతి DSCలో ఒకటి, అర మార్కులతో ఎస్జీటీ పోస్టు చేయి జారినా నిరుత్సాహపడలేదు. 2025 DSC ఇక తనకు చివరిదిగా భావించి రాత్రింబవళ్లు కష్టపడి ఎస్జీటీ పోస్టుకు ఎంపికై తన చిరకాల కలను సాధించాడు.
News August 24, 2025
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గీతా మాధురి

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కర్నూలుకు చెందిన గీతా మాధురిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గీతా మాధురి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. గతంలో మహిళా మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.
News August 24, 2025
కర్నూలు: ఒకే ఇంట్లో ముగ్గురికి టీచర్ ఉద్యోగాలు

కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన మన్సూర్ బాషా, జిలాని బేగం దంపతులకు చెందిన ముగ్గురు పిల్లలు డీఎస్పీ మెరిట్ లిస్టులో ఉద్యోగాలు సాధించారు. మొహమ్మద్ హనీఫ్ 79.67, హసీనా బాను 81.62, హరూన్ రషీద్ 84.11 మార్కులతో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని పిల్లలు పేర్కొన్నారు.