News August 27, 2025
కర్నూలు జిల్లాలో ఉచిత విద్యకు 1,082 మంది ఎంపిక

కర్నూలు జిల్లాలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)సీ కింద 1,082 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్ తెలిపారు. ఎంపికైన వారు నేటి నుంచి 31వ తేదీ వరకు కేటాయించిన పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలన్నారు. సంబంధిత అధికారులు మండలాల వారీగా వివరాలను సేకరించి, నివేదికను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.
Similar News
News August 27, 2025
ఇంటర్నేషనల్ వాలీబాల్ శిక్షణలో రాజేశ్

ఈనెల 23 నుంచి 27 వరకు ఇండోనేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ వాలీబాల్ లెవెల్ వన్ కోర్సుకు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో వాలీబాల్ శిక్షకుడిగా ఉన్న రాజేశ్ అర్హత సాధించి శిక్షణ పూర్తి చేశారు. దేశం నుంచి ఎంపికైన నలుగురు శిక్షకుల్లో కర్నూలుకు చెందిన రాజేశ్ ఉండటడం విశేషం. రాజేశ్ ఎంపిక పట్ల డీఎస్డీవో భూపతి రావు, సీనియర్ క్రీడాకారులు, జిల్లా వాలీబాల్ సంఘం, జిల్లా ఒలింపిక్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
News August 26, 2025
రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని ప్రారంభించిన మంత్రి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో పాటు సంబంధిత అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో సిటీ స్కాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు.
News August 26, 2025
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడిగా రంగన్న

ఒంగోలులో జరిగిన సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలలో ఆ పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యదర్శి రంగన్నను రాష్ట్ర సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం సీపీఐ, ప్రజా సంఘాల ప్రతినిధులు సమివుల్లా, విజయేంద్ర, తిమ్మగురుడు, వీరేశ్ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమితి సభ్యుడిగా రంగన్నను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.