News March 4, 2025
కర్నూలు జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

➤ కర్నూలు: వలస కూలీల కొడుకు ఎస్ఐగా ఎంపిక ➤ డిగ్రీ విద్యార్థి అదృశ్యం ➤ త్వరలో కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి➤ మంత్రాలయం శ్రీ మఠానికి పోటెత్తిన భక్తులు➤ ఇంటర్ పరీక్షల్లో ఏడుగురు డీబార్➤ క్లస్టర్ యూనివర్సిటీ వీసీకి ఆత్మీయ వీడ్కోలు➤ అసెంబ్లీల బడ్జెట్పై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ప్రసంగం➤ కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి ➤ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్లో కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
Similar News
News March 5, 2025
జిల్లాలో తాగునీటి సమస్య రావొద్దు: కలెక్టర్

జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మండల స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం తాగునీటి పరిస్థితి, MSME సర్వే, PGRS, రెవెన్యూ సర్వీస్లు, NREGS తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, RWS ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
News March 4, 2025
కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి

కర్నూలులో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కోడుమూరు మండలం వెంకటగిరికి చెందిన రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ కృష్ణారెడ్డి డీ మార్ట్ వైపు వాకింగ్కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణారెడ్డి కోడుమూరు మండలం లద్దగిరిలో హాస్టల్ వార్డెన్గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం కర్నూలులో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 4, 2025
ఆటో డ్రైవర్ కూతురికి ఎస్ఐ ఉద్యోగం

బేతంచెర్లకు చెందిన శేషాద్రి, నాగలక్ష్మి దంపతుల కుమార్తె నిర్మల ఎస్ఐగా ఎంపికయ్యారు. శేషాద్రికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్న శేషాద్రి.. తన మూడో కుమార్తె నిర్మలను బీటెక్ వరకు చదివించారు. ఎస్ఐగా ఎంపికై అనంతపురం పోలీస్ శిక్షణ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ పొందారు. ఈ సందర్భంగా పలువురు నిర్మలను అభినందించారు.