News February 25, 2025

కర్నూలు జిల్లాలో పింఛన్లకు రూ.103.33 కోట్లు

image

కర్నూలు జిల్లాలో మార్చి నెల పింఛన్ పంపిణీకి నిధులు మంజూరయ్యాయి. 2,38,798 మందికి రూ.103.33 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని ఆయా సచివాలయాల సిబ్బంది ఈ నెల 28లోపు విత్ డ్రా చేసుకోవాలని సూచించింది. మార్చి 1న ఉదయం 6 గంటల నుంచే గ్రామ, పట్టణాల్లో లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తం అందజేయనున్నారు.

Similar News

News February 25, 2025

జీవీ రెడ్డి రాజీనామా బాధాకరం: ఆదోని ఎమ్మెల్యే

image

ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవి, టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా చేయడం బాధాకరమని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఆయనను రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరతామన్నారు. జీవీరెడ్డి సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అని.. ఆయనను కన్విన్స్ చేసి మళ్లీ రాజకీయాల్లోకి యాక్టివ్ చేయాల్సిన బాధ్యత ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోనూ అధికారులు తమ మాట వినట్లేదని తెలిపారు.

News February 25, 2025

అర్జీలను నాణ్యతగా పరిష్కారించండి: సబ్ కలెక్టర్

image

ఆదోని సబ్ కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొని ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్‌ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.

News February 24, 2025

కర్నూలు జిల్లా TODAY TOP NEWS

image

➢ మంత్రాలయంలో కన్నడ స్టార్ హీరో
➢ పాణ్యంలో పండ్ల వాహనం బోల్తా.. ఎగబడిన స్థానికులు
➢ శ్రీశైల కాలినడక భక్తుడికి అస్వస్థత.. డోలీలో 5 కి.మీ..
➢ అసెంబ్లీకి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు
➢ కర్నూలు ఎస్పీ సాయం కోరిన ప్రేమ జంట
➢ ఎమ్మిగనూరు టీడీపీ నేత వార్నింగ్
➢ భీముని కొలను వద్ద యువతికి తీవ్ర అస్వస్థత
➢ ఆదోనిలో 30 ఏళ్లుగా డ్రైనేజీ సమస్య
➢ అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి: సబ్ కలెక్టర్

error: Content is protected !!