News March 27, 2025
కర్నూలు జిల్లాలో భానుడి సెగలు.!

కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం ఆలూరు మండలం కమ్మరచేడులో 40.7°C ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. కాగా, మార్చి నెలలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Similar News
News March 30, 2025
కర్నూలు జిల్లాలో చికెన్ ధర రూ.200

కర్నూలు జిల్లాలో పలు చోట్ల చికెన్ ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, తదితర ప్రాంతాల్లో లైవ్ కోడి కిలో రూ.120 ఉండగా.. స్కిన్ రూ.180, స్కిన్ లెస్ రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. 2 నెలల క్రితం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గి, మటన్, చేపల విక్రయాలు పెరిగాయి. దీంతో కిలో మటన్ రూ.900, చేపలు రూ.300 చొప్పున అమ్ముతున్నారు.
News March 30, 2025
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

మార్చి 31న రంజాన్ పండుగ ను పురస్కరించుకొని సోమవారం పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News March 30, 2025
ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు

క్రిష్ణగిరి మండల పరిధిలోని పెనుమాడలో ఇటీవల విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలలో ఒకే కుటుంబంలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇందులో ఇద్దరు అసిస్టెంట్ లోకో పైలట్, ఇద్దరు జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్, ఒకరు ఏపీ హైకోర్టులో సబర్డినేట్ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామంలో ఉద్యోగాలు రావడంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.