News February 23, 2025

కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

image

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.

Similar News

News February 20, 2026

HYD: రూ.4000 వ్యాక్సిన్ ఉచితం

image

HYDలోని బాలికలకు గుడ్ న్యూస్. గర్భాశయ క్యాన్సర్‌ను తరిమికొట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. FEB చివరి నుంచి నగరంలోని బస్తీ దవాఖానలు, PHCల్లో 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకాలు వేయనున్నారు. బయట దాదాపు రూ.4,000 ఉండే ఈ ‘గార్డాసిల్ 4’ వ్యాక్సిన్ ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా లభిస్తుంది. HYD వేలాది మంది, TGలో 4.6 లక్షల మందికి మేలు జరగనుంది. ఈ వ్యాక్సిన్ 14-15 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు పంపిణీ చేస్తారు.

News February 20, 2026

HYD: రూ.4000 వ్యాక్సిన్ ఉచితం

image

HYDలోని బాలికలకు గుడ్ న్యూస్. గర్భాశయ క్యాన్సర్‌ను తరిమికొట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. FEB చివరి నుంచి నగరంలోని బస్తీ దవాఖానలు, PHCల్లో 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకాలు వేయనున్నారు. బయట దాదాపు రూ.4,000 ఉండే ఈ ‘గార్డాసిల్ 4’ వ్యాక్సిన్ ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా లభిస్తుంది. HYD వేలాది మంది, TGలో 4.6 లక్షల మందికి మేలు జరగనుంది. ఈ వ్యాక్సిన్ 14-15 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు పంపిణీ చేస్తారు.

News February 20, 2026

శ్రీకాకుళం: కొత్త పంచాయతీలు ఎన్ని ఏర్పడతాయో?

image

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో చాలాచోట్ల కొత్త పంచాయతీలు ఏర్పాటు కోసం అధికారులకు ప్రతిపాదనలు పంపారు. కొత్తగా 64 పంచాయతీల ప్రతిపాదనలు అధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపారు. 35 కొత్త పంచాయతీలు ఏర్పాటుకు కమిషనర్ కార్యాలయం నుంచి ఆమోదం లభించింది. ఇంకా కొత్త పంచాయతీలు ఏర్పాటుపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.