News November 11, 2024

కర్నూలు జిల్లాలో TODAY TOP NEWS

image

* నందవరం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
* శ్రీశైలంలో డ్రోన్ కలకలం.. ఆలయ సిబ్బంది అదుపులో యువకులు
* ఆదోనిలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరికలు
* ఎమ్మిగనూరు: గుండెపోటుతో యువకుడు మృతి
* ఎమ్మిగనూరులో ఈ నెల12న జాబ్ మేళా
* నంద్యాల: రేపు ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: కలెక్టర్ రాజకుమారి గణియా
* కర్నూలు: టీడీపీ యాదవులకు తీరని అన్యాయం చేసింది: అయ్యన్న యాదవ్

Similar News

News February 11, 2026

రైల్వే సమస్యలను పరిష్కరించండి: ఎంపీ వినతి

image

జిల్లాలో నెలకొన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ నాగరాజు కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొంటున్న ఆయన.. బుధవారం ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. కర్నూలు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు కొత్త రైలు సర్వీసులను పెట్టడంతో పాటు ఇతర సర్వీసులను పొడిగించాలని కోరారు.

News February 11, 2026

బకాయిల వసూలుపై కఠినంగా వ్యవహరించాలి: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో GST అమలుపై కలెక్టర్ ఏ.సిరి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పన్నుల వసూళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలపై కఠినంగా వ్యవహరించి, వాటిని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సెక్షన్ 51 ప్రకారం ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు GST రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు. ప్రతీ నెల 20వ తేదీ లోపు రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలన్నారు.

News February 11, 2026

ఈ నెల 13న మందకృష్ణ మాదిగ రాక

image

కౌతాళం మండలం హాల్వి, గుడికంబళి గ్రామాలలో ఈ నెల 13న బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు MRPS జిల్లా ఇన్‌ఛార్జ్ దుమ్ము చిన్న వెంకటేశ్వర్లు మాదిగ, MSP జిల్లా అధికార ప్రతినిధి జి.ఆనంద్ చైతన్య మాదిగ తెలిపారు. కార్యక్రమానికి MRPS వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఇవాళ గోనెగండ్లలో అందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.