News March 25, 2025
కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

➤ కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు
➤ బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ
➤ నవోదయ ఫలితాల్లో ఆస్పరిలో బార్బర్ కొడుకు ప్రతిభ
➤ ఆలూరు: వంట గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ వ్యక్తి మృతి
➤ శ్రీశైలం మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం
➤ సీఎం సమావేశంలో జిల్లా కలెక్టర్
➤ నందవరంలో వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్
➤ ఎమ్మిగనూరులో 27న జాబ్ మేళా
➤కోసిగిలో గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
Similar News
News March 27, 2025
ఫోన్ చూడొద్దన్నందుకు కర్నూలులో యువకుడి ఆత్మహత్య

తల్లిదండ్రుల మందలించారని యువకుడు ఆత్మహత్యకు చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. చౌడేశ్వరి వీధిలో నివాసం ఉంటున్న కృష్ణమోహన్, వసంత దంపతుల కుమారుడు యశ్వంత్ (21) వడ్రంగి పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఫోన్ చూస్తుండంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 27, 2025
బైరెడ్డికి పదవి.. వైసీపీ శ్రేణుల హర్షం

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైఎస్ జగన్ కీలక పదవి ఇవ్వడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడంతో సిద్ధార్థ్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ‘నాపై నమ్మకంతో మరో బాధ్యత ఇచ్చిన జగన్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ బైరెడ్డి ట్వీట్ చేశారు.
News March 27, 2025
కర్నూలు జిల్లాలో భానుడి సెగలు.!

కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం ఆలూరు మండలం కమ్మరచేడులో 40.7°C ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. కాగా, మార్చి నెలలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.