News September 23, 2024
కర్నూలు డీఆర్డీఏ పీడీగా ప్రతాపరెడ్డి
కర్నూలు జిల్లాలో వివిధ శాఖలకు అధికారులను నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నూతన డీఆర్డీఏ పీడీగా ప్రతాపరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిగా రామనాథరెడ్డి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్గా నాగసుధను నియమించారు. ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సలాం బాషాను సంబంధిత శాఖ రాష్ట్ర కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News September 23, 2024
ఈ ఫొటోలోని నేతను గుర్తుపట్టారా?
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి కర్నూలు జిల్లా ప్రముఖ రాజకీయ నేత. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు సీఎంగా సేవలందించారు. విద్య, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పాలనలో తనదైన ముద్ర వేశారు. ఐదుసార్లు శాసనసభ, ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికై 1999 ఎన్నికలలో ఓటమితో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 81 ఏళ్ల వయసులో 2001లో తుదిశ్వాస విడిచారు. ఆయనెవరో గుర్తుపట్టారా? ఆయన జన్మించిన గ్రామం పేరేంటి? కామెంట్ చేయండి.
News September 23, 2024
మంత్రాలయంలో వర్షం
కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మంత్రాలయంలో కుండపోత వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ వర్షంపై కొందరు రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న పత్తి, మిర్చి, ఉల్లి, సజ్జ తదితర పంటలు తడిసి ముద్దై నష్టపోతున్నామని చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో నేడూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
News September 23, 2024
మహానంది ఆలయ డిప్యూటీ కమిషనర్గా శోభారాణి
మహానంది డిప్యూటీ కమిషనర్గా రాష్ట్ర దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న డీసీ.శోభారాణిని నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మహానంది ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డికి పల్నాడు జిల్లాలోని అమరేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా బదిలీ చేశారు.