News October 17, 2024
కర్నూలు, నంద్యాల జిల్లాలో సెలవు ఇవ్వాలని డిమాండ్
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని జిల్లా వాసులను చల్లటి గాలులు పలకరిస్తున్నాయి. మిడుతూరు, మహానంది, ఆళ్లగడ్డ, డోన్ తదితర మండలాల్లో రాత్రి జోరు వర్షం కురిసింది. నేడూ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలపడంతో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులివ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముసురు వాతావరణంతో బయటకు వచ్చే పరిస్థితిలేదని సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.
Similar News
News October 17, 2024
‘నాటి ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే కోసం మా ఇళ్లు కూల్చేశారు’
ప్రభుత్వ స్థలంలో రుణం తీసుకొని ఇళ్లు నిర్మించుకుంటే అప్పటి వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హపీజ్ ఖాన్ ఆదేశాల మేరకు అధికారులు మా ఇంటిని కూల్చేశారని కర్నూలు రాహుల్ గాంధీ నగర్ కు చెందిన టి.కుమారి కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు జనవాణిలో ఫిర్యాదు చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
News October 17, 2024
ట్రాన్స్ జెండర్లకు సమాన అవకాశాలు కల్పిస్తాం: నంద్యాల కలెక్టర్
సమాజంలో పురుషులు, స్త్రీలతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తామని నంద్యాల కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ట్రాన్స్ జెండర్ల అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ట్రాన్స్ జెండర్లు మెరుగైన జీవితాన్ని అవలంబించేందుకు పురుషులు, స్త్రీలతో సమాన అవకాశాలు కల్పిస్తూ ఉపాధి మార్గాలు చూపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
News October 17, 2024
ఆలూరు: చేనుకు గడ్డి మందు కొట్టిన దుండగులు
ఆలూరు మండలంలోని మనేకుర్తి గ్రామానికి చెందిన ఈరమ్మ 9 ఎకరాల్లో రూ.1.50 లక్షల ఖర్చుతో జొన్న పంట సాగుచేసింది. బుధవారం చేనుకు వెళ్లి చూడగా పంటకు ఎవరో గడ్డిమందు కొట్టారని బాధిత మహిళ వాపోయింది. అయితే ఆస్తి పంపకాలు చేయలేదని తన కుమారులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.