News May 24, 2024

కర్నూలు: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం

image

జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 69 పరీక్షా కేంద్రాలలో 17,458 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి ఉపాధ్యాయులు తనిఖీ చేసి అనుమతించారు. 69మంది చీఫ్ సూపర్డెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించినట్లు డీఈఓ శామ్యూల్ తెలిపారు.

Similar News

News October 11, 2024

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 13 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

News October 11, 2024

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు, పోలీసులు సంతోషంగా జీవించాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందేలా విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆకాంక్షించారు.

News October 11, 2024

ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: కలెక్టర్

image

ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో-భేటి పడావో కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తోందన్నారు. ఆడపిల్లలను మంచి చదువులు చదివించాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు.