News March 18, 2024

కర్నూలు: పీజీ సెమిస్టర్‌కు 90శాతం హాజరు

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షకు సోమవారం నాడు 90 శాతం విద్యార్థులు హాజరైనట్లు యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. మొత్తం 558 మంది విద్యార్థులకు గాను.. 53 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.

Similar News

News July 3, 2024

కర్నూలు: హిజ్రాలకు గుర్తింపు కార్డులు

image

కర్నూలు జిల్లాలో నివాసం ఉంటున్న హిజ్రాలకు ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా తెలిపారు. ఇప్పటి వరకు వాటిని పొందని వారు http://transgender.dosje.gov.inలో ఆధార్ కార్డు, నోటరీ అఫిడవిట్ పొందుపరిస్తే కలెక్టర్ ద్వారా ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు.

News July 3, 2024

నంద్యాల నూతన కలెక్టర్ ప్రస్థానం

image

నంద్యాల జిల్లా నూతన కలెక్టర్‌గా బీ.రాజకుమారి నియమితులయ్యారు. శ్రీకాకుళం (D) టెక్కలి మండలం కొల్లివలస ఆమె స్వస్థలం. 2009 గ్రూప్‌-1 అధికారి అయిన ఈమె విజయనగరం ఆర్డీవోగా ఎంపికయ్యారు. 2013లో సింహాచలం దేవస్థానం స్పెషల్ డీసీగా, 2017లో తూ.గోలో డ్వామా పీడీగా, 2019లో అదే జిల్లాకు JC(వెల్ఫేర్)గా పని చేశారు. 2021లో IAS హోదా పొందారు. ప్రస్తుతం గుంటూరు JCగా ఉన్న ఈమె నంద్యాల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

News July 3, 2024

పొదుపు ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి: కలెక్టర్

image

ఓర్వకల్లులో సాగిన పొదుపు ఉద్యమం అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిందని కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఓర్వకల్లులోని బాలభారతి పాఠశాల మైదానంలో మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం రజతోత్సవ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మగవాళ్లు చదువుకుంటే ఆ కుటుంబం పైకి వస్తుందని, ఒక మహిళ చదువుకుంటే ఇంటితో పాటు సమాజంలో ఉన్న వారందరూ పైకి వస్తారని అన్నారు.