News November 1, 2025
కర్నూలు ప్రమాదం: దుష్ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు

AP: కర్నూలు బస్సు దుర్ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు నమోదైంది. ఇందులో YCP అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల, సీవీ రెడ్డి, కందూరి గోపీకృష్ణ, YCP ట్విటర్ నిర్వాహకులు ఉన్నారు. కర్నూలు రూరల్(M) తాండ్రపాడుకు చెందిన వేణుములయ్య ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కల్తీ మద్యం, బెల్టుషాపులే <<18120317>>కారణమని<<>> ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని అందులో పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే: KTR

TG: రేవంత్ నకిలీ వాగ్దానాలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఓటమితోనే అంతమవుతాయని KTR వ్యాఖ్యానించారు. ‘500 రోజుల్లో KCR తిరిగి సీఎం అవుతారు. ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే. జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీతో గెలుస్తాం. రేవంత్ చేసే బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పతనం ఖాయం. రేవంత్కు కాంగ్రెస్తో ఉన్నది ఫేక్ బంధం. BJPతో ఉన్నది పేగు బంధం’ అని విమర్శించారు.
News November 2, 2025
BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా ఈజీ అశోక్ కుమార్ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.
News November 2, 2025
4 ప్రాంతాల్లో SIR ప్రీటెస్టు సెన్సస్

AP: ECI దేశవ్యాప్తంగా SIR చేపట్టాలని నిర్ణయించడం తెలిసిందే. దీనిలో భాగంగా తొలివిడత ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ప్రీటెస్టు కోసం ఏపీలో 4 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను ఖరారు చేశారు. అల్లూరి(D) GKవీధి(M), ప్రకాశం(D) పొదిలి(NP), నంద్యాల(D) మహానంది(M), విశాఖ కార్పొరేషన్లోని 2, 3 వార్డులను ఎంపిక చేశారు. వీటిలో ప్రీటెస్ట్ నిర్వహణకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లను నియమించారు.


