News December 31, 2025
కర్నూలు: ‘ప్రైవేట్ వాహనాలకు VLTD తప్పనిసరి’

అన్ని ప్రైవేట్ సర్వీస్ వాహనాలకు 2026 జనవరి 1 నుంచి VLTD (వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్) తప్పనిసరి అని కర్నూలు రవాణా శాఖ ఉప కమిషనర్ శాంత కుమారి తెలిపారు. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, స్టేజీ క్యారేజ్, కాంట్రాక్ట్ క్యారేజ్తో పాటు అన్ని సరుకు వాహనాల యజమానులు సమీప RFC కేంద్రాల్లో VLTD బిగించి రవాణా శాఖలో నమోదు చేయాల్నారు. VLTD అమర్చని వాహనాలకు వాహన్ పోర్టల్లో అందుబాటులో ఉండవని అన్నారు.
Similar News
News December 31, 2025
కర్నూలు జిల్లాలో కొత్త పాస్ పుస్తకాల జారీ.. ఎప్పటినుంచంటే?

కర్నూలు జిల్లాలోని 141 గ్రామాల్లో జనవరి 2 నుంచి 9 వరకు నిర్వహించే రెవెన్యూ గ్రామసభల ద్వారా రైతులకు రాజముద్రతో కూడిన 94,090 కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. పాత భూహక్కు పత్రాలు తిరిగి ఇచ్చి కొత్త పాస్పుస్తకాలు అందజేస్తారన్నారు. రైతులు గ్రామసభలకు హాజరుకావాలని కోరారు.
News December 31, 2025
ట్రైనీ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో మెలగాలి: ఎస్పీ

క్రమశిక్షణ, చట్టాలపై అవగాహనతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు సూచించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పొందుతున్న 205 ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్లో నైపుణ్యం అవసరమి చెప్పారు.
News December 31, 2025
ఎస్పీగా విక్రాంత్ పాటిల్ పదిలమైన ముద్ర

కర్నూలు జిల్లా ఎస్పీగా 10 నెలల కాలంలో తనదైన ముద్ర వేసిన విక్రాంత్ పాటిల్, డీఐజీగా పదోన్నతి పొందారు. ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన ఆయన సైబర్ నేరాలు, గంజాయి విక్రయాలు, ఈవ్టీజింగ్పై ఉక్కుపాదం మోపారు. హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్పై అవగాహన కల్పిస్తూ నేరాల శాతాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. పదోన్నతి పొందిన ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.


