News June 17, 2024
కర్నూలు: మాజీ పంచాయతీ సభ్యుడు మృతి

మద్దికేర మండల కేంద్రానికి చెందిన పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు చాకలి నాగేశ్ (52) ఇవాళ మృతిచెందాడు. వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, సర్పంచ్ బండారు సుహాసిని, వైసీపీ నాయకులు, రజక సంఘం నాయకులు నివాళులర్పించారు.
Similar News
News September 13, 2025
కర్నూలు: ‘ప్రజల వద్దకే తపాల సేవలు’

తపాల శాఖలో నూతన టెక్నాలజీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐయంఏ 2.O ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజల ముంగిటే తపాల సేవలను అందివ్వడం జరుగుతుందని కర్నూలు జిల్లా పోస్టల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం తుంగభద్ర ఉప తపాల కార్యాలయంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బీపీఎంలు, ఎబీపీఎంలతో సమావేశం నిర్వహించారు. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్తో తపాల బీమా, ఐపీపీబీ ద్వారా ఖాతాలు తెరవడం జరిగిందని తెలిపారు.
News September 13, 2025
సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాను సమిష్ఠి కృషితో అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ సిరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కర్నూలు కలెక్టర్గా ఇది తన మొదటి పోస్టింగ్ అని, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కోరారు. జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.
News September 13, 2025
కర్నూలు జిల్లా కలెక్టర్గా సిరి బాధ్యతల స్వీకరణ

కర్నూలు జిల్లా నూతన కలెక్టర్గా అట్టాడ సిరి ఇవాళ ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఛాంబర్లో ఉదయం 10.40 గంటలకు మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి, ఆమెను ఆశీర్వదించారు. పలువురు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ లబ్ధిదారుడికి చేరేలా కృషి చేద్దామన్నారు.