News February 15, 2025
కర్నూలు మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈనెల 17న తిరుపతి, ఒంటిమిట్ట, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, బాసర, వారణాశి మీదుగా ప్రయాగ్రాజ్ చేరుకుంటుంది. తిరిగి జబల్పూర్, హైదరాబాద్, కర్నూలు, మహానంది మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్సు 17న మ.2.15 గంటలకు కర్నూలుకు వస్తుంది. టికెట్ ధర రూ.20వేలు, పిల్లలకు రూ.17, 200లుగా నిర్ణయించారు.
Similar News
News November 9, 2025
పేకాట శిబిరంపై దాడి.. రూ.68,920 సీజ్: సీఐ

కురుపాం మండలం సింగుపురం సమీపంలో పేకాట శిబిరంపై సీఐ బి.హరి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకొని వారి వద్ద ఉన్న రూ.68,920 సీజ్ చేశామని సీఐ తెలిపారు. పట్టుబడినవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఎస్సైలు నారాయణరావు, శివప్రసాద్, పోలీస్ సిబ్బంది
News November 9, 2025
మెదక్: ’17న ఛలో ఢిల్లీ’

సీజేఐ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా ఈనెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ వెంకటస్వామి మాదిగ పేర్కొన్నారు. మెదక్లో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నత స్థానంలో ఉన్న దళితులకే రక్షణ లేకుండా పోయిందని, సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
News November 9, 2025
MLAపై రేప్ కేసు.. AUSకు జంప్.. మళ్లీ ఆన్లైన్లో..!

రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ ఆప్ MLA హర్మిత్ సింగ్ ఆస్ట్రేలియాకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. తనకు బెయిల్ వచ్చిన తర్వాతే తిరిగొస్తానని తాజాగా ఆన్లైన్ వేదికగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 2న పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న హర్మిత్ అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. తనను ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో పారిపోయినట్లు ప్రచారం జరిగింది.


