News October 17, 2025
కర్నూలు మోదీ సభ హైలైట్స్

★ చంద్రబాబు నాయకత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ: పీఎం మోదీ
★ మోదీ సంస్కరణలు గేమ్ చేంజర్లు: సీఎం
★ మోదీ ఓ కర్మయోగి.. మరో 15ఏళ్లు కూటమి పాలన: డిప్యూటీ సీఎం
★ ప్రధాని కోరినవన్నీ ఇస్తున్నారు: లోకేశ్
★ అఖండ భారతావని బాగుండాలని శ్రీశైలంలో మోదీ పూజలు
★ లోకేశ్కు ప్రధాని కితాబు.. సరదా ముచ్చట
★ ₹13,429 కోట్ల పనులకు శ్రీకారం
★ టైం అంటే టైం.. షెడ్యూల్ ప్రకారమే సాగిన పర్యటన
★ సభలో 2 లక్షల మంది పాల్గొన్నారని అంచనా
Similar News
News October 18, 2025
పాడేరు: అనారోగ్యంతో వ్యక్తి మృతి.. అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యమే కారణం?

పాడేరు మండలం చౌడుపల్లికి చెందిన మాదెల రామ్మూర్తి అనారోగ్యానికి గురవడంతో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని గురువారం రాత్రి వైద్యులు విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. రామ్మూర్తిని తరలించడంలో అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎట్టకేలకు వేరే అంబులెన్సులో విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అంబులెన్సు సిబ్బంది లేట్ చేయడం వల్లే రామ్మూర్తి మృతి చెందాడని బంధువులు ఆరోపించారు
News October 18, 2025
గుంటూరు జిల్లాలో ఎందరో గాన గంధర్వులు

గుంటూరు జిల్లా అంటేనే కలలకు పుట్టినిల్లు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు జిల్లాకి ఖ్యాతి తెచ్చారు. S.జానకి, MS రామారావు, శ్యామనారాయణ, కల్యాణం రఘురామయ్య, చిత్తూరు నాగయ్య, నాగభైరు అప్పారావు, మాతంగి విజయరాజు, వారణాసి రామసుబ్బయ్య, షేక్ నాజర్, మాధవపెద్ది సత్యం, మనో, సునీత తదితరులు నేపధ్య గాయని, గాయకులు తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు.
@నేడు ప్రపంచ గాన దినోత్సవం
News October 18, 2025
అక్రమ టపాసులపై కఠిన చర్యలు: కర్నూలు ఎస్పీ

దీపావళి పండుగ వేళ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్లలో టపాసుల విక్రయాలు జరిగే ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచినట్లు తెలిస్తే 112/100కు సమాచారం ఇవ్వాలని కోరారు.