News November 19, 2025

కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

image

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News April 14, 2026

HYDలో 40 దాటింది.. జాగ్రత్త!

image

HYDలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. నాంపల్లి పరిధిలోని బేగంబజార్ ప్రాంతంలో మంగళవారం గరిష్ఠంగా 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముషీరాబాద్, మారేడ్‌పల్లిలో, హిమాయత్‌నగర్ ప్రాంతంలో హిమాయత్‌నగర్ ప్రాంతంలో 40.5-40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
SHARE IT

News April 14, 2026

అప్పులతో అమరావతి నిర్మాణం అసాధ్యం: విజయ సాయి రెడ్డి

image

బెంగళూరు, హైదరాబాద్ తరహాలో అమరావతి ఎదగడానికి సమయం పడుతుందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి Xలో ట్వీట్ చేశారు. అప్పులతో రాత్రికి రాత్రే రాజధానిని నిర్మించడం అసాధ్యమన్నారు. ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు మాత్రమే నిర్మించాలని సూచించారు. కాలక్రమంలో ప్రజలు, వ్యాపారాలతో రాజధాని సహజంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారీ డిజైన్ల కోసం ప్రజాధనం వృథా చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని విమర్శించారు.

News April 14, 2026

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

ఒంగోలు మండలం వెంగమక్కపాలెం గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. టిప్పర్ రివర్స్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు TVS ఎక్సెల్‌పై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు లారీ చెక్రాలకింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు టంగుటూరు మండలం ఎర్రజర్ల ఎస్సీ కాలనీకి చెందిన పేరయ్యగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.