News August 23, 2024

కర్నూలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

image

కోసిగి రైల్వేస్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి శుక్రవారం దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై పడటంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 6, 2025

మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక మృతి

image

మంత్రాలయం మండలం మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఐదేళ్ల బాలిక లలిత సోమవారం మృతిచెందింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు మట్టి గడ్డలను తొలగించి వారిని రక్షించారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

News October 6, 2025

కర్నూలు టీచర్లకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

image

విద్యారంగంలో విశిష్ట సేవలందించిన కర్నూలు బి.క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు వైవీ రామకృష్ణ, ఎన్.విజయశేఖర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రపంచ అధ్యాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కర్నూలు సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో NHR SJC India–Global, UCP & LRF సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందజేశారు.

News October 5, 2025

సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై పోటీలు: డీఈవో

image

ఈనెల 7న జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. వివరాలకు కర్నూల్–II సర్కిల్ (9000724191)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.