News March 21, 2024
కర్నూలు: వరుసగా 5సార్లు MLA.. 3సార్లు ఓటమి

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీవీ మోహన్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. నియోజకర్గంలో 8సార్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అందులో 1983 నుంచి 1999 వరకు వరుసగా 5సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి 2012 వరకు వరుసగా చెన్నకేశ్వరెడ్డి చేతిలో 3సార్లు ఓటమిపాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర గౌడ్పై 28904 అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది.
Similar News
News March 31, 2025
కర్నూలు: రూ.71.47 కోట్ల పన్నులు వసూలు

నగరాభివృద్ధికి పన్నులు చెల్లించి సహకరించాలనే కర్నూలు నగరపాలక సంస్థ పిలుపునిచ్చింది. స్పందించిన బకాయిదారులు అత్యధిక సంఖ్యలో పన్నులు చెల్లించినందుకు నగరపాలక మేనేజర్ చిన్నరాముడు, ఆర్వో ఇశ్రాయేలు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వారు కేఎంసీ కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.71.47 కోట్లు పన్ను రూపంలో వసూలు అయినట్లు తెలిపారు.
News March 31, 2025
కర్నూలు: 12వ రోజుకు చేరిన మున్సిపల్ చైర్ పర్సన్ దీక్ష

నాలుగేళ్ల పాలనలో ఎలాంటి తప్పు చేయలేదని, సొంత పార్టీ ఐనా వైసీపీ కౌన్సిలర్లు తనను ఛైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిరసిస్తూ ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ శాంత దీక్ష చేపట్టారు. ఈ దీక్ష సోమవారం 12వ రోజుకు చేరుకుంది. ఉగాది, రంజాన్ పండగలు ఉన్నప్పటికీ ఈనెల 20 నుంచి దీక్ష నిరంతరంగా కొనసాగిస్తున్నారన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు న్యాయం చేయాలని శాంత కోరారు.
News March 31, 2025
ఆదోనిలో సచివాలయ ఉద్యోగి సూసైడ్

ఆదోని మండలం కపటి గ్రామ సచివాలయ ఉద్యోగి మధు సూసైడ్ చేసుకున్నాడు. శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన మధు (26) కపటిలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి భోజనం చేసి మేడపై గదిలో పడుకున్నాడు. ఆదివాదం ఉదయం తల్లిదండ్రులు చూడగా .. అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. తండ్రి నారాయణరావు ఫిర్యాదుతో త్రీ టౌన్ సీఐ రామలింగయ్య కేసు నమోదు చేశామన్నారు.