News March 5, 2025
కర్నూలు: వలస కూలీల కొడుకు SIగా ఎంపిక

నందవరం మండలం మిట్టసాంపురానికి చెందిన శ్యామరావు, సువర్ణమ్మ దంపతుల రెండో కుమారుడు మారెప్ప తన తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనింగ్ను పూర్తి చేసుకున్న ఆయనకు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వలస కూలీలు కాగా.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం నేటికి దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మారెప్పను అభినందించారు.
Similar News
News March 5, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 209 మంది గైర్హాజరు
>గురుకులంలో 400 సీట్లకు అప్లై చేసుకోండి: రంపచోడవరం పీవో
> ఈనెల కూడా పప్పు, పంచదార లేదు
>అల్లూరి సిగలో మరో జలపాతం
>పాడేరు: సివిల్స్ ఉచిత శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం
>గంగవరం: సాగునీటి కోసం అన్నదాతల అవస్థలు
>అరకు: సెల్ఫ్ డిఫెన్స్ పై విద్యార్థులకు శిక్షణ
>కొత్తపుట్టు జంక్షన్ వద్ద 70 కిలోల గంజాయి స్వాధీనం
News March 5, 2025
సౌతాఫ్రికా ఓటమి.. ఫైనల్లో కివీస్తో భారత్ పోరు

భారత్తో CT ఫైనల్ ఆడే జట్టేదో తేలిపోయింది. మిల్లర్ సెంచరీతో అద్భుత పోరాటం చేసినా సెమీఫైనల్-2లో NZ చేతిలో SA 50పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ నెల 9న CT ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. కివీస్ నిర్దేశించిన 363 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన SA ఒత్తిడిని జయించలేక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివర్లో మిల్లర్(100) 4 సిక్సులు, 10 ఫోర్లతో విధ్వంసం సృష్టించినా ఫలితం లేకపోయింది.
News March 5, 2025
నిర్మల్: జిల్లా నేతలకు దిశా నిర్దేశం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్దామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన అంతర్గత పార్టీ సమావేశంలో జిల్లా నాయకులకు ఆమె దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితరులున్నారు.