News June 15, 2024
కర్నూలు: వాము క్వింటా గరిష్ఠ ధర రూ.20,160
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పంట ఉత్పత్తుల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెట్కు 104 క్వింటాళ్ల వేరుశనక్కాయల దిగుబడులు రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.4,929, మధ్యస్థ ధర రూ.6,371, గరిష్ఠ ధర రూ.7,200 పలికింది. 318 క్వింటాళ్ల వాము దిగుబడులు రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.711, మధ్యస్థ ధర రూ.17,501, గరిష్ఠ ధర రూ.20,160 పలికినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు.
Similar News
News October 6, 2024
నంద్యాల: టైరు పేలి గ్యాస్ సిలిండర్ల ఆటో బోల్తా
బనగానపల్లె మండలం యనకండ్ల సమీపంలో ఆదివారం ఉదయం గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో టైర్ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. బనగానపల్లె నుంచి యనకండ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు.
News October 6, 2024
చిన్న చెరువులో మృతదేహం లభ్యం
అవుకు రిజర్వాయర్ సమీపంలోని చిన్న చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటి ప్రవాహానికి మృతదేహం కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కూళ్లిపోయి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 6, 2024
రేపటి నుంచి యూనివర్సిటీలకు దసరా సెలవులు
కర్నూలు జిల్లాలోని యూనివర్సిటీలకు దసరా సెలవులు ప్రకటించారు. రాయలసీమ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలకు ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లు డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ వీ.లోకనాథ తెలిపారు. 14వ తేదీ తిరిగి పునఃప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు.