News February 13, 2026
కర్నూలు విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల పరిహారం

అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన కర్నూలు విద్యార్థిని జాహ్నవి(23) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (సుమారు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి 2023 జనవరి 3న రాత్రి రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.
Similar News
News February 20, 2026
16 శుక్రవారాల వ్రతం ఉద్యాపన విధానం

16 శుక్రవారాల వ్రతం పూర్తయ్యే చివరి వారంలో ‘ఉద్యాపన’ చేయాలి. ఆ రోజున 8 మంది బాలురను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. భోజనంలో పాయసం, పూరీ, బెల్లం, శనగలు వడ్డించాలి. భోజనంలో పులుపు ఉండకూడదు. భోజనం తర్వాత పిల్లలకు అరటిపండు, ప్రసాదం, దక్షిణ ఇవ్వాలి. పిల్లలు ఆ రోజున ఏ విధమైన పులుపు పదార్థాలు తినకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే వ్రతం సంపూర్ణమవుతుంది. అమ్మవారి కృపతో ఆ ఇల్లు సుఖశాంతులతో నిండిపోతుంది.
News February 20, 2026
బంగారు మనసు.. 100గ్రా. గోల్డ్ తిరిగిచ్చేశాడు!

₹15 లక్షల విలువైన బంగారాన్ని తిరిగిచ్చి స్క్రాప్ డీలర్ నిజాయతీ చాటుకున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్లో అశోక్ శర్మ 2025లో కుంభమేళాకు వెళ్తూ 100G బంగారం పేపర్లో దాచి మరిచిపోయారు. దీపావళికి ఇల్లు క్లీన్ చేసి, పొరపాటున స్క్రాప్తో కలిపి అమ్మేశారు. తర్వాత స్క్రాప్ షాపులో వెతికినా బంగారం దొరకలేదు. ఈ క్రమంలో 4 నెలల తర్వాత షాప్ యజమాని అఖ్తర్ ఖాన్కు బంగారం కనిపించింది. పోలీసుల ద్వారా అశోక్కు అందజేశారు.
News February 20, 2026
అబద్ధాలు ట్రెండ్ కావచ్చు.. కానీ గెలిచేది నిజమే: లోకేశ్

AP: <<19166821>>హెరిటేజ్ ఫుడ్స్<<>> విషయంలో నిజం గెలిచిందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘హెరిటేజ్ సంస్థపై సాక్షి మీడియా చేసింది తప్పుడు ప్రచారమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. పరువు నష్టం కలిగించే కంటెంట్ను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. అబద్ధాలు ఒక రోజు ట్రెండ్ కావచ్చు. కానీ న్యాయ పరీక్షలో నిజమే గెలుస్తుంది. సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేశారు.


