News March 25, 2024

కర్నూలు: వైసీపీని వీడిన మంత్రికి టీడీపీలో దక్కని టికెట్

image

ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్ టీడీపీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. అయితే అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలోనూ ఆయనకు టికెట్ కేటాయించలేదు. అక్కడి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత, ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రతికూలత రావడంతో గుమ్మనూరుకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆలూరుపై ఆశలు పెట్టుకున్న జయరాం కోట్ల సుజాతమ్మ మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

Similar News

News March 16, 2025

కర్నూలు: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠాశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదివారం తెలిపారు. ఈ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థులను యూనిఫామ్‌తో పరీక్షలకు పంపితే, ఆ పాఠశాలల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News March 16, 2025

కర్నూలు: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠాశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదివారం తెలిపారు. ఈ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థులను యూనిఫామ్‌తో పరీక్షలకు పంపితే, ఆ పాఠశాలల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News March 16, 2025

ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయాలి: MP

image

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు పదవ తరగతి అని, ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!