News March 28, 2025
కర్నూలు ‘సాక్షి’ ఆఫీసు ఎదుట ఆళ్లగడ్డ MLA నిరసన

కేజీ చికెన్ కు రూ.10 వసూలు చేస్తున్నారనే YCP వ్యాఖ్యలను, ‘సాక్షి’లో వచ్చిన కథనాలను ఆళ్లగడ్డ MLA భూమా అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు. కర్నూలులోని సాక్షి కార్యాలయం ఎదుట ఆమె భర్త భార్గవ్ రామ్, టీడీపీ శ్రేణులతో కలిసి కోళ్ళతో ఆమె వినూత్న నిరసన తెలిపారు. పేపర్లో వచ్చే ధరకే చికెన్ ఇప్పిస్తామనే మాటను నేను మాట్లాడితే, నాపై అవాస్తవాలు రాసి ప్రతిష్టకు బంగారం కలిగిస్తున్నారని అఖిలప్రియ ఫైర్ అయ్యారు.
Similar News
News March 31, 2025
నేడు 38 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం-8, విజయనగరం-9, మన్యం-10, అల్లూరి-2, తూర్పుగోదావరి-8, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో వడగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఉష్ణోగ్రతలు మండిపోయాయి. ప్రకాశం జిల్లా అమాని గుడిపాడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News March 31, 2025
BHPL: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం (UPDATE)

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్గా నిలిచిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో ఇది 3వ ప్రభుత్వ ఉద్యోగంగా సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.
News March 31, 2025
నిజామాబాద్ జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు: కలెక్టర్

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలోనూ నియమ నిష్ఠలతో దాదాపు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.