News November 29, 2024
కర్నూలు: ‘సెమిస్టర్ పరీక్షలను పక్కగా నిర్వహించాలి’

పరీక్షలను సరిగ్గా నిర్వహించాలని ఇన్ఛార్జి వైస్ ఛాన్స్లర్ ఎన్టీకే నాయక్ అన్నారు. శుక్రవారం రాయలసీమ వర్సిటీ పరిధిలో డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. 6,531 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 5,848 మంది హాజరయ్యారు. 683 గైర్హాజరయ్యారు.
Similar News
News April 4, 2026
డెంగ్యూ లక్షణాలపై తప్పనిసరి పరీక్షలు

డెంగ్యూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డా. కామేశ్వర ప్రసాద్ సూచించారు. ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీలో జరిగిన మలేరియా ల్యాబ్ టెక్నీషియన్స్ సమావేశంలో మాట్లాడారు. రోజుకు 65 పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపారు. హెచ్ఐవి, టీబీ కేసుల రికార్డులను సక్రమంగా నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
News April 4, 2026
సూర్యఘర్ ఉత్సవ్కు శ్రీకారం: సీఎండీ

ఈ నెల 5 నుంచి 14 వరకు ‘సూర్యఘర్ ఉత్సవ్’ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. 9 జిల్లాల్లో 25 వేల ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. 25 వేల ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలపై రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
News April 4, 2026
కర్నూలులో ఈనెల 7న ఉద్యోగ మేళా

కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి వి.దీప్తి తెలిపారు. ఈ మేళాలో Enovizon, GPS Renewable Energy, Blue Star, Amber వంటి సంస్థలు పాల్గొని ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు.


