News May 15, 2024

కర్నూలు: 4 దశాబ్దాలుగా ఆ 5 గ్రామాల్లో ఒకే పార్టీకి ఓట్లు.. కానీ ఇప్పుడు..!

image

ఎమ్మిగనూరు NLA చెన్నకేశవరెడ్డికి పట్టున్న కడిమెట్ల, సిరాళ్లదొడ్డి, గువ్వలదొడ్డి, రాళ్లదొడ్డి, ఎర్రకోటలో ఈ ఎన్నికల్లో తొలిసారిగా TDP ఏజెంట్లు కూర్చున్నారు. ఈ 5 గ్రామాల్లో 4 దశాబ్దాలుగా ఏకపక్షంగా ఎన్నికలు జరిగేవి. MLA ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఓట్లు పడేవి. ఈ గ్రామాల్లో సుమారు 10 వేల ఓట్లు ఉండగా పోటీలోని ఇతర పార్టీకి అరకొరగా ఓట్లు పడేవి. ఇటీవల MLA సోదరుల కుమారులు TDPలో చేరడంతో ఏజెంట్లు కూర్చున్నారు.

Similar News

News May 7, 2025

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కర్నూలు కలెక్టర్

image

విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆకాంక్షించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువును అభ్యసించినప్పుడే మంచి స్థాయిలో నిలుస్తారని అన్నారు.

News May 7, 2025

అవయవ దానంతో పునర్జన్మను ఇవ్వొచ్చు: కలెక్టర్

image

అవయవదానం మానవతా కోణంతో చేసే ఒక గొప్ప పనని, అవయవ దానంతో మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం ఓ హాస్పిటల్‌లో అవయవ దానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అవయవదానం కేవలం దానం కాదు, కొన్ని జీవితాల్లో వెలుగులు నింపే ఆచరణని తెలిపారు. అనంతరం వైద్యులను కలెక్టర్ సన్మానించారు.

News May 7, 2025

హాలహర్విలో వైసీపీ నాయకుడి హత్య

image

హాలహర్వి మండలం అమృతాపురం గ్రామానికి చెందిన వైసీపీ నేత వెంకటేశ్(55) హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన ఆయన సాయంత్రం మృతదేహమై కనిపించాడు. కుటుంబీకుల సమాచారంతో సీఐ రవిశంకర్ రెడ్డి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.