News April 1, 2024

కర్నూల్: ఇద్దరు వాలంటీర్లపై వేటు

image

మార్చి 29న ఎమ్మిగనూరులో జరిగిన సీఎం జగన్ సిద్ధం సభకు వెళ్లినట్లు తేలటంతో ఇద్దరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు పత్తికొండ ఎంపీడీవో డి.రామారావు తెలిపారు. మండలానికి చెందిన బుల్లేని పాండు, ఎర్రమల శివ నిబంధనలను అతిక్రమించి సిద్ధం సభకు వెళ్లడంతో విధుల నుంచి తొలగించామన్నారు. కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనొద్దన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News September 29, 2025

నెలకు రూ.వెయ్యి ఆదా: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు: జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ప్రజలకు కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పోస్టర్లను సోమవారం ఆమె ఆవిష్కరించారు. జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ప్రతి కుటుంబానికి నెలకు రూ.వెయ్యి వరకు ఆదా అవుతోందని తెలిపారు.

News September 29, 2025

రాయలసీమ: ఆర్.యు పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

రాయలసీమ యూనివర్సిటీ పీజీ రెండో సెమిస్టర్ ఫలితాలను ఆదివారం ఉపకులపతి ప్రొఫెసర్ వెంకట్రావు బసవరావు విడుదల చేశారు. పీ. జీ రెండవ సెమిస్టర్ లో 462 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 413 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
విద్యార్థులు ఫలితాలను రాయలసీమ యూనివర్సిటీ వెబ్సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని తెలిపారు.

News September 28, 2025

తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

image

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం ప్రతీ శనివారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేసి, వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్, ఓవర్‌లోడ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి వాటిపై ముఖ్య సూచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.