News May 6, 2024
కర్నూల్: ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
13న జరిగే ఎన్నికలను బహిష్కరిస్తున్నామని కర్నూల్లోని నాల్గవ తరగతి ఉద్యోగస్తుల కాలనీ వాసులు పేర్కొన్నారు. కాలనీ వాసులు కృష్ణారెడ్డి, లెనిన్, నాగరాజు, బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. 10వేలకు పైగా జనాభా ఉన్న మా కాలనీలో ఒక్క మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా లేదన్నారు. కాలనీ సమస్యలను పరిష్కరించలేని నాయకులు మాకు అవసరం లేదన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకులను ప్రచారానికి అనుమతించమని హెచ్చరించారు.
Similar News
News October 1, 2024
నేడు పత్తికొండకు CM చంద్రబాబు
కర్నూలు (D) పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉ.11:40 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి 12:30కు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ఏ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 12:40 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1:05 నిమిషాలకు పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకుంటారు. అనంతరం గ్రామంలో పింఛన్ పంపిణీ చేస్తారు. సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News October 1, 2024
800 మందితో భారీ బందోబస్తు: కర్నూలు ఎస్పీ
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో నేడు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బిందు మాధవ్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. DSPలు-5, CIలు-38, SIలు-40, ASI, HCలు-160, PCలు-213, హోంగార్డులు-106 మందితో పాటుగా 3 ఏఆర్, 5 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించినట్లు ఈమేరకు ఎస్పీ వెల్లడించారు.
News September 30, 2024
కర్నూలు: మార్కెట్కు ఉల్లి సరకు తీసుకురావద్దు
కర్నూలు మార్కెట్కు రైతులు ఉల్లి సరకు తీసుకురావద్దని రైతులకు, కమిషన్ దారులకు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్.జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ మార్కెట్లో అత్యధికంగా ఉల్లి వచ్చినందున మార్కెట్లో ఎక్కడా స్థలం కూడా ఖాళీ లేదని చెప్పారు. లారీలు వచ్చి వెళ్లడానికి కూడా ట్రాఫిక్ సమస్య ఉందని తెలిపారు.