News July 22, 2024

కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు

image

కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.43 ఉండగా 52 పైసలు తగ్గి నేడు రూ.108.91కు చేరింది. డీజిల్ 48 పైసలు తగ్గి నేడు లీటర్ రూ.96.80గా ఉంది. నంద్యాల జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.76 ఉండగా 33 పైసలు పెరిగి నేటికి రూ.110.09కు చేరింది. 30 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్‌ ధర రూ.97.87గా ఉంది.

Similar News

News February 9, 2026

కర్నూలు: ‘37 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

image

కర్నూలు(D) వెల్దుర్తి జడ్పీ హైస్కూల్ (1988-89 బ్యాచ్) 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దాదాపు 100 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. అలాగే పలు కారణాలతో మృతి చెందిన మిత్రులకు మౌనం పాటించి, నివాళులర్పించారు. వివిధ రంగాల్లో స్థిరపడిన మిత్రులను ఘనంగా సన్మానించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు స్మరించున్నారు.

News February 9, 2026

కర్నూలు: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రేపు ఇంటర్వ్యూ!

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 10న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. 11 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని చెప్పారు.

News February 9, 2026

103 మంది విద్యార్థులు హాజరు కాలేదు: లాలప్ప

image

జిల్లా వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాలలో ఆదివారం జరిగిన ఇంటర్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరంలో 2,721 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 82 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంలో 1,968 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 21 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు.