News October 8, 2025
కర్నూల్ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించిన వైఎస్ జగన్

వైసీపీ టాక్స్-కర్నూల్ యూట్యూబ్ ఛానల్ను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బటన్ నొక్కారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 2, 2026
చద్దాకు వెల్లువెత్తుతున్న మద్దతు!

రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా <<19547250>>రాఘవ్ చద్దా<<>>ను ఆప్ తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. SMలో ఆయనకు మద్దతుగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పక్షాన నిలబడిన MPకి ఇచ్చే గౌరవం ఇదా అని నిలదీస్తున్నారు. ఆయనకు అన్యాయం జరిగిందంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తొలగింపునకు గల కారణాలను పార్టీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. దీంతో చద్దాకు, పార్టీకి మధ్య ఏమైనా విభేదాలున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
News April 2, 2026
TU: ట్రాన్స్జెనిక్ పంటలు-ఆధునిక వ్యవసాయంలో విప్లవం

టీయూ వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ట్రాన్స్జెనిక్ పంటలు-ఆధునిక వ్యవసాయంలో విప్లవం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. OU ప్రొ.సబితా రాణి హాజరై మాట్లాడారు. ఆధునిక వ్యవసాయంలో జెనెటిక్ ఇంజినీరింగ్ ప్రభావం&స్థిరమైన పంట ఉత్పత్తిపై లోతైన అవగాహన అవసరమని, జెనెటిక్ మోడిఫికేషన్ టెక్నిక్స్, జెనోమ్ ఎడిటింగ్, మాలిక్యులర్ బ్రీడింగ్ వంటి సాంకేతికతలను వివరించారు. TU అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News April 2, 2026
ఇసుక రవాణాలో పారదర్శకత పాటించాలి: ADB కలెక్టర్

జిల్లాలో ఇసుక రవాణా పారదర్శకంగా సాగాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మన ఇసుక – వాహనం’ పోర్టల్ పనితీరు, ఇసుక నిల్వలను సమీక్షించారు. ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, మైనింగ్ ఏడీ రవీందర్ పాల్గొన్నారు.


