News October 8, 2025

కర్నూల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్

image

వైసీపీ టాక్స్‌-కర్నూల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బటన్ నొక్కారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News October 8, 2025

ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు – వృషభాద్రి

image

తిరుమల కొండల్లో ఐదవది ‘వృషభాద్రి’. సాధన చేసే భక్తుడు ఏకాగ్రతతో ధ్యానించినప్పుడు, అతని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని చేరుకుంటుంది. అంటే.. దాదాపు 80% ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తైనట్లే. ఈ దశలో సంసార బంధాలన్నీ తెగిపోయి, మనస్సు బంధాలు లేని వృషభం(ఎద్దు) వలె కేవలం పరమాత్మ వైపే వేగంగా పరుగులు తీస్తుంది. ఈ శక్తిమంతమైన భావాన్ని సూచిస్తూనే ఈ కొండకు ‘వృషభాద్రి’ అనే దివ్య నామం వచ్చింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News October 8, 2025

సిరిసిల్ల: సన్నవడ్ల BONUSపై ఆశలు గల్లంతేనా..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్న వడ్లకు బోనస్ వస్తుందనే ఆశలు ఆవిరవుతున్నాయని పలువురు రైతన్నలు పేర్కొన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో రైతన్నలు సన్న వడ్లను సాగు చేశారు. గత సీజన్లో ప్రభుత్వం 10 వేల క్వింటాళ్లకుపైగా సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు బోనస్ రాకపోవడంతో రైతులు దిగాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో కూడా సన్నాలను సాగు చేశారు.

News October 8, 2025

హుజూరాబాద్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం

image

హుజూరాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గ్రామ శివారులోని కాకతీయ కాలువలో బుధవారం ఉదయం గుర్తుతెలియని మృత దేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని, రెండు రోజుల క్రితం కాలువలో పడి ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. శవం ఉబ్బిపోవడంతో గుర్తింపు కష్టతరమైందని పోలీసులు తెలిపారు. మరణానికి గల కారణం, వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.