News June 18, 2024

కర్నూల్: 4.29 లక్షల మంది రైతులకు రూ.2 వేలు జమ

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి. జిల్లాలోని రైతులకు రూ.2 వేలు చొప్పున అకౌంట్లలో జమకానుంది. కర్నూలు జిల్లాలోని 2.34 లక్షల మంది రైతులకు రూ.46.97 కోట్లు, నంద్యాల జిల్లాలోని 1.95 లక్షల మంది రైతులకు రూ.39.19 కోట్ల మేర సాయం అందనుంది. లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఈ లింక్ <>క్లిక్<<>> చేసి చూసుకోవచ్చు.

Similar News

News October 4, 2024

క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా ఓటరు జాబితా సర్వే: కమిషనర్

image

ఓటరు జాబితా సవరణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేపట్టాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు బీఎల్ఓలను ఆదేశించారు. గురువారం నగరపాలక నూతన కౌన్సిల్ హాలులో బిఎల్‌ఓ‌లతో సమావేశం నిర్వహించారు. ఫాం 6, 7, 8ల పూరింపులపై అవగాహన కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతకు కొత్త ఓటుకు ధరకాస్తు, చనిపోయినవారి ఓటు తొలగింపు, సవరణలు తప్పొప్పులు లేకుండా ప్రక్రియ చేయాలన్నారు.

News October 3, 2024

గ్రామపంచాయతీలో రైతుబజార్ల ఏర్పాటు: కలెక్టర్

image

RIDF, నాబార్డ్ గ్రాంట్ కింద గ్రామపంచాయతీలో రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో RIDF, నాబార్డ్ గ్రాంట్ బేస్డ్ ప్రాజెక్టుల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నాబార్డ్ గ్రాంట్ కింద జీవనోపాదుల కల్పనకు విరివిగా అవకాశాలున్నాయని, సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.

News October 3, 2024

ఉపాధి హామీ పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జీ.రాజకుమారి ఎంపీడీవోలు, ఏపీఓలు, క్షేత్రస్థాయి సిబ్బంది ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దినసరి సరాసరి కూలి వేతన చెల్లింపులో దిగువ స్థానంలో ఉన్నామని వేతన కూలి రేటు పెంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు.