News March 5, 2025

క‌ర్మ‌యోగి పోర్ట‌ల్ ద్వారా ఆన్‌లైన్ శిక్ష‌ణ పూర్తిచేసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్ర‌భుత్వ ఉద్యోగులంతా మార్చి 16వ తేదీలోగా ఐగాట్ క‌ర్మ‌యోగి పోర్ట‌ల్ ద్వారా త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్ శిక్ష‌ణ పూర్తిచేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా.బీఆర్‌‌ అంబేడ్కర్ ఆదేశించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను పెంచ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఆన్‌లైన్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింద‌న్నారు.

Similar News

News July 9, 2025

VZM: అగ్నిప్రమాదం.. ఇళ్లబాట పట్టిన విద్యార్థినులు

image

కొత్తవలస మండలం తుమ్మికాపల్లి KGBVలో మంగళవారం రాత్రి జరిగిన <<16996993>>అగ్ని ప్రమాదం<<>>తో ఆందోళన చెందిన విద్యార్థినిలు ఇళ్ల బాట పట్టారు. 20 రోజుల క్రితం ఇదే పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. వరుస ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెంది ఇళ్లకు తీసుకెళ్లారు. గతంలో జరిగిన ప్రమాదంపై స్పందించిన మంత్రి లోకేశ్.. ఈసారి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

News July 9, 2025

VZM: ‘ఆ వాహనాలను త్వరితగతిన గుర్తించాలి’

image

హిట్ అండ్ రన్ కేసుల్లో నేరానికి పాల్పడిన వాహనాలను త్వరితగతిని గుర్తించాలని SP వకుల్ జిందాల్ ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లించేందకు సాక్ష్యాలను సేకరించి RDOకు పంపాలన్నారు. అలాగే వివిధ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తులో ఉన్న 194BNSS (గుర్తు తెలియని మృతదేహాల) కేసులను సమీక్షించారు. కేసుల దర్యాప్తు అంశాలను పొందుపరచాలన్నారు.

News July 8, 2025

VZM: ‘బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ పూర్తి చేయండి’

image

P4 కార్య‌క్ర‌మంలో భాగంగా వెంట‌నే మార్గ‌ద‌ర్శుల‌ను గుర్తించే ప్ర‌క్రియ‌ను మొదలుపెట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లా అధికారులు, ఆర్‌డివోలు, నియోజ‌క‌వ‌ర్గ స్పెష‌ల్ ఆఫీస‌ర్లతో సోమ‌వారం క‌లెక్ట‌ర్ త‌మ ఛాంబ‌ర్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. జిల్లా వ్యాప్తంగా 67,066 బంగారు కుటుంబాల‌ను గుర్తించామని, వారి ద‌త్త‌త ప్ర‌క్రియ ఈ నెలాఖ‌రుకు పూర్తి చేయాలన్నారు.