News December 26, 2025
కలికిరి: రేపు మాజీ సీఎం రాక

మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి శనివారం రానున్నారు. హైదరాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన 1.15 గంటలకు తిరుపతి రాఘవేంద్ర నగర్లోని రామకృష్ణా రెడ్డి ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కలికిరిలోని బీజేపీ కార్యాలయానికి వస్తారని ఆయన పీఏ క్రిష్ణప్ప తెలిపారు.
Similar News
News December 27, 2025
మోత్కూరు: 20 గుంటల్లో.. 23 పంటలు

మోత్కూరుకు చెందిన ఆదర్శ రైతు బిల్లపాటి గోవర్ధన్రెడ్డి కేవలం 20 గుంటల భూమిలో 23 రకాల పంటలను సాగు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. రసాయన రహిత ఆహారమే లక్ష్యంగా నాలుగేళ్లుగా సేంద్రియ సాగు చేస్తున్నారు. కాలజీరా, బహురూపి, మణిపురి బ్లాక్ వంటి దేశవాళి వరి రకాలను పండిస్తున్నారు. ఒంగోలు జాతి ఆవుల ఆధారంగా గో ఆధారిత వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
News December 27, 2025
నర్సంపేట: పొలాల్లో మొసలి కలకలం!

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామంలో మొసలి పిల్ల కలకలం రేపింది. ఓ రైతు పొలంలో శుక్రవారం సాయంత్రం మొసలి పిల్ల కనిపించింది. స్థానికులు భయంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సిబ్బంది మొసలిని పట్టుకొని ఖానాపురం మండలం పాకాల సరస్సులో వదిలినట్లు తెలిపారు. సమీపంలో వాగు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
News December 27, 2025
మరణంలోనూ వీడని స్నేహం

కర్ణాటకలో జరిగిన ఘోర <<18664780>>బస్సు ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదం నింపింది. చనిపోయిన వారిలో నవ్య, మానస అనే ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. మరణంలోనూ వారు కలిసే ఉన్నారంటూ నవ్య తండ్రి రోదించారు. ‘వాళ్లు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకే కంచంలో తినేవారు. ఒకేచోట చదువుకున్నారు. ఒకే రకం డ్రెస్సులు వేసుకునే వారు. ఒకేచోట పని చేస్తున్నారు. సెలవని ఇంటికొస్తూ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు’ అని విలపించారు.


