News January 28, 2025
కలికిరి: స్టేట్ లెవెల్ రిపబ్లిక్ డే పెరేడ్లో JNTU విద్యార్థుల ప్రదర్శన

స్థానిక కలికిరి JNTU విద్యార్థులు నిన్న విజయవాడలో జరిగిన స్టేట్ లెవెల్ రిపబ్లిక్ డే పెరేడ్ (SLRDC-2025)లో ప్రదర్శన కనబరచినట్లు ప్రిన్సిపల్, M. వెంకటేశ్వరరావు తెలిపారు. శరత్ కుమార్(EEE), ఢిల్లీ ప్రసాద్ (EEE), క్రిష్ణ (EEE), హరి (ECE), గురు హర్షిత్(ME) పాల్గొన్నారన్నారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసినట్లు NSS కోఆర్డినేటర్ డా. K. అపర్ణ తెలిపారు.
Similar News
News November 12, 2025
GNT: జిల్లాలో అదనంగా 264 పోలింగ్ కేంద్రాలు

గుంటూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ద్వారా అదనంగా 264 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాలులో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
News November 12, 2025
VKB: స్కూల్లో విద్యార్థికి విద్యుత్ షాక్

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద రక్షణ కంచె లేకుండా ఉన్న 33 కె.వి ట్రాన్స్ఫార్మర్ ప్రమాదానికి కారణమైంది. భోజన విరామ సమయంలో మూడవ తరగతి విద్యార్థి వంశీ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులు, కాళ్లు కాలడంతో పాటు తలకు గాయాలు అయ్యాయి. ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 12, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 2

9. మానవులు మానవత్వముని ఎట్లు పొందుతారు? (జ.అధ్యయనం వలన), 10. మానవునికి సాధుత్వాలు ఎలా సంభవిస్తాయి? (జ. తపస్సుతో సాధుత్వం, శిష్టాచార భ్రష్టతవంతో అసాధుభావం సంభవిస్తాయి.)
11. మానవుడు మనుష్యుడెలా అవుతాడు? (జ.మృత్యు భయము వలన)
12. జీవన్మృతుడెవరు? (జ.దేవతలకు, అతిధులకు పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
<<-se>>#YakshaPrashnalu<<>>


