News April 6, 2025

కలిదిండి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

image

ఎలుకల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఈ నెల 3న మద్యం తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు. మద్యం మానేయాలని భార్య మందలించడంతో మనస్తాపానికి గురై 4వ తేదీన ఎలుకల మందుని నీళ్లలో కలుపుకుని తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

Similar News

News September 16, 2025

RRBలో 13,217 పోస్టులు.. ఏం చదవాలి?

image

RRB 13,217 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 21 ఆఖరు తేదీ. ప్రాథమిక పరీక్షలు NOV-DEC 2025లో, మెయిన్ ఎగ్జామ్ DEC 2025 నుండి FEB 2026లో నిర్వహిస్తారు. ఇప్పటినుంచి ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించవచ్చు. అభ్యర్థులు Reasoning, Numerical Ability, Computer Knowledge, General Awareness, English/Hindi Language వంటి విభాగాలపై పట్టు సాధించాలి.

News September 16, 2025

కొమరోలు: సస్పెండ్ అయిన అధ్యాపకులు వీరే.!

image

కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అధికారులకు తమ సమస్యలపై <<17721439>>లేఖలు<<>> రాశారు. స్పందించిన RDO పద్మజ కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. జువాలజీ అధ్యాపకుడు సుధాకర్ రెడ్డి, కెమిస్ట్రీ అధ్యాపకుడు ప్రభాకర్, కామర్స్ అధ్యాపకుడు హర్షవర్ధన్ రెడ్డి, బాటని అధ్యాపకుడు లోకేశ్‌లను సస్పెండ్ చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కిశోర్ కుమార్‌ను ఉలవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డిప్యూటేషన్‌పై పంపారు.

News September 16, 2025

NZB: 8 మందిలో ఆరుగురు పిట్లం వారే

image

నిజాం రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు విమోచనం కల్పించడానికి పిట్లంలోని ఆరుగురు యోధులు అలుపెరగని పోరాటం చేశారు. వారిలో ఉప్పు లక్ష్మయ్య, నాగయ్య, లక్ష్మారెడ్డి, నారాయణ, లక్ష్మయ్య, నారాయణ, కృష్ణారావు, సుబ్బారావు ఉన్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో 8 మంది ఉండగా వారిలో ఆరుగురు పిట్లం వాసులే కావడం విశేషం. నేటికీ బాన్సువాడ MRO కార్యాలయం ఎదుట ఉన్న శిలాఫలకంపై వారి పేర్లు చెక్కబడి ఉన్నాయి.