News April 6, 2025
కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల వారి సమస్యలపై వినతులు స్వీకరిస్తామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి సమస్యల పరిష్కారాలకు చేస్తామన్నారు.
Similar News
News April 8, 2025
సీఎం ఛైర్మన్గా జలహారతి కార్పొరేషన్

AP: పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వైస్ ఛైర్మన్గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఈఓగా జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఉండనున్నారు. పోలవరం వరద నీరు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 80వేల కోట్లకు పైగా ఖర్చవుతుండగా, 3లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయని ప్రభుత్వ అంచనా.
News April 8, 2025
థ్రిల్లింగ్ మ్యాచ్: KKRపై LSG విజయం

కేకేఆర్తో జరిగిన మ్యాచులో లక్నో విజయం సాధించింది. 239 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కేకేఆర్ 234 పరుగులు చేసింది. దీంతో LSG 4 పరుగుల తేడాతో గెలిచింది. కేకేఆర్లో రహానే (61), వెంకటేశ్ (45) రాణించారు. చివర్లో రింకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
News April 8, 2025
అనకాపల్లి: ఈ ఏడాది 132 మంది అరెస్ట్

గంజాయి కేసుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 132 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. 42 కేసులు నమోదు కాగా 178 మందిని గుర్తించామని కలెక్టర్కు వివరించారు. 3,090 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 53 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.