News August 21, 2024
కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మున్సిపల్ కమిషనర్

కరీంనగర్ నూతన మున్సిపల్ కమిషనర్గా చాహత్ బాజ్పాయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చాహత్ బాజ్పాయ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేల సత్పతిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.
Similar News
News February 12, 2026
KNR: ‘నగర’ ఫలితం: లెక్కింపునకు సర్వం సిద్ధం

కరీంనగర్ నగరపాలక సంస్థ 66 డివిజన్ల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో సీపీ గౌస్ ఆలం పాల్గొని దిశానిర్దేశం చేశారు. 300 మంది సిబ్బందితో శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 66 టేబుళ్లు ఏర్పాటు చేయగా, తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం సాధారణ ఓట్లను లెక్కిస్తారు.
News February 12, 2026
KNR: ‘సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి’

KNR మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. గర్భిణీలు, పిల్లల వార్డును సందర్శించి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడి సమావేశ మందిరంలో గైనకాలజిస్టులు, అనస్తీసియా, పిల్లల వైద్యులు, రేడియాలజిస్టులు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని వైద్య బృందానికి సూచించారు.
News February 12, 2026
కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండాలి: సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. నగరంలోని అస్త్ర కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్లో పోలీసు అధికారులకు, సిబ్బందికి సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకుండా నిఘా ఉంచాలన్నారు.


