News April 15, 2025
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్

HYDలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ హోదాలో కలెక్టర్ డా. పి.శ్రీజ పాల్గొన్నారు. భూ భారతి పోర్టల్, ఇందిరమ్మ ఇండ్లు, వేసవిలో తాగు నీటి ప్రణాళికలపై సీఎం చర్చించినట్లు ఇన్చార్జ్ కలెక్టర్ తెలిపారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను ఆయా మండలాల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని సీఎం చెప్పారన్నారు.
Similar News
News November 6, 2025
పోష్, పోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఇన్చార్జ్ కలెక్టర్

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీజ అన్నారు. గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగ స్థలాల్లో మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సూచించారు. పిల్లల రక్షణకు పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు.
News November 6, 2025
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను చేరుకోవాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఆయిల్ పామ్ పంట శిక్షణ కార్యక్రమంలో అ. కలెక్టర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక లాభాలను అందిస్తుందని, ఎటువంటి నష్టం సంభవించదని తెలిపారు. రైతులకు అంతర్ పంటల ద్వారా కూడా ఆదాయం లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి మధుసూదన్ పాల్గొన్నారు.
News November 6, 2025
ఖమ్మం: స్కూటీ రిపేర్ చేయలేదని షో రూమ్కు తాళం

ఖమ్మంలో గురువారం వినూత్న ఘటన జరిగింది. తన ఎలక్ట్రికల్ స్కూటీని రిపేర్ చేయలేదన్న కారణంగా ఓ వ్యక్తి ఏకంగా షోరూమ్కు తాళం వేశాడు. బోనకల్ మండలం రావినూతలకి చెందిన కొమ్మినేని సాయి కృష్ణ నాలుగు నెలల క్రితం స్కూటీ కొనుగోలు చేశారు. రిపేరు రావడంతో షోరూమ్ సిబ్బందిని సంప్రదించగా, అది తమ పరిధిలో రిపేరు కాదని వారు తెలిపారు. దీంతో అసహనానికి గురైన సాయి కృష్ణ ఆ షోరూమ్కు తాళం వేసినట్లు సమాచారం.


