News November 19, 2025
కలెక్టర్ హెచ్చరిక

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
Similar News
News April 3, 2026
సిరిసిల్ల : ముగిసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గురువారం ఆయా గ్రామాల సర్పంచ్ ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై చర్చించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇంటర్ విద్యార్థులకు అల్పాహార పథకంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి నిర్ణయం తీసుకొని సమావేశాలను ముగించారు.
News April 3, 2026
BREAKING NEWS: పేర్ని కిట్టుపై కేసు నమోదు

మచిలీపట్నం నియోజకవర్గ YCP ఇన్ఛార్జ్<<19544536>> పేర్ని కిట్టుపై<<>> చిలకలపూడి PSలో కేసు నమోదైంది. గురువారం ఉదయం కొబ్బరితోటలో ఓ అక్రమ భవన నిర్మాణం జరుగుతున్న సమయంలో తన విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా బెదిరించేలా మాట్లాడారని ఇనగుదురుపేట సీఐ పరమేశ్వరరావు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై BNS 132, 351(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
News April 3, 2026
BREAKING NEWS: పేర్ని కిట్టుపై కేసు నమోదు

మచిలీపట్నం నియోజకవర్గ YCP ఇన్ఛార్జ్<<19544536>> పేర్ని కిట్టుపై<<>> చిలకలపూడి PSలో కేసు నమోదైంది. గురువారం ఉదయం కొబ్బరితోటలో ఓ అక్రమ భవన నిర్మాణం జరుగుతున్న సమయంలో తన విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా బెదిరించేలా మాట్లాడారని ఇనగుదురుపేట సీఐ పరమేశ్వరరావు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై BNS 132, 351(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


