News November 19, 2025
కలెక్టర్ హెచ్చరిక

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
Similar News
News March 5, 2026
రేపటి నుంచి భగభగలు!

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో టెంపరేచర్ 38°C దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిన్న కర్నూలులో అత్యధికంగా 38.5°C నమోదైంది. అటు తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 40+డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News March 5, 2026
యుద్ధంపై బెట్టింగ్.. ₹కోట్లు గెలుచుకున్నారు!

US-ఇరాన్ యుద్ధంతో ఓ పక్క ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే కొందరు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం కాసులపంట పండించుకున్నారు. ఇరాన్పై US ఎప్పుడు దాడి చేస్తుందో అంచనా వేసి పాలీమార్కెట్ అనే క్రిప్టో ప్లాట్ఫామ్లో గత శుక్రవారం 150 మంది బెట్ కాశారు. వీరిలో 16 మంది లక్ష డాలర్లు, ఓ వ్యక్తి 5లక్షల డాలర్లు (₹4కోట్లు) సంపాదించారు. అయితే యుద్ధంపైన బెట్టింగ్ ఏంటని పాలీమార్కెట్ సహా యూజర్లపై విమర్శలు వస్తున్నాయి.
News March 5, 2026
కర్నూలు: 395 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.


