News September 22, 2025
కలెక్టర్ PGRSకు 240 వినతులు

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు 240 వినతులు అందాయి. వీటిలో భూ సమస్యలకు సంభందించి రెవిన్యూ శాఖకు అత్యధికంగా 106 వినతులు వచ్చాయి. పంచాయతిశాఖకు 15, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డిఏకు 28 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. వీటిని కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, జేసీ సేదు మాధవన్ స్వీకరించారు.
Similar News
News September 25, 2025
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

విజయనగరం కలెక్టరేట్లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ పరిసరాల పరిశుభ్రతకు పాటు పడాలని పిలుపునిచ్చారు. రోజుకో ఓ గంట సమయం సేవకు కేటాయించాలని కలెక్టర్ సిబ్బందికి చెప్పారు. కలెక్టర్తో పాటు జేసీ సేదుమాధవన్, అధికారులు, నాయకులు, మున్సిపల్ తదితరులు ఉన్నారు.
News September 25, 2025
ఓటర్ల జాబితాను మ్యాప్ చేయండి: VZM కలెక్టర్

ఓటర్ల జాబితా సవరణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం సమీక్షించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను మ్యాప్ చేయాలని తెలిపారు. ఓటర్ల సవరణ కోసం అందిన ఫారం 6, 7, 8ని నిర్దేశిత గడువు లోగా డిస్పోజ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
News September 24, 2025
VZM: ‘రెవెన్యూ వినతులపై సానుకూలంగా వ్యవహరించాలి’

విజయనగరం కలెక్టరేట్లో బుధవారం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి అధికారులు ఈ-ఆఫీస్ ద్వారానే ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపాలన్నారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ వినతులకు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. వినతుల పై ప్రజల సంతృప్తి పెరగాలని అన్నారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవ్, DRO శ్రీనివాస్ మూర్తి పాల్గొన్నారు.