News January 31, 2026

కల్తీ నెయ్యి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా YCP పూజలు

image

AP: కల్తీ నెయ్యి వివాదంలో దుష్ప్రచారం చేస్తున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకున్న CBN, పవన్‌కు భగవంతుడే బుద్ధి చెప్తారని YCP నేతలు చెప్పారు. వారి వ్యాఖ్యలను నిరసిస్తూ పాప పరిహార పూజలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ వంగా గీత, తూ.గో జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి, YSR జిల్లా బద్వేలులో MLA దాసరి సుధ, NTR జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని ప్రత్యేక పూజలు చేశారు.

Similar News

News February 20, 2026

రాష్ట్రంలో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని RTGS అంచనా వేసింది. సెంట్రల్ ఆంధ్ర, ఉత్తర కోస్తా, ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.

News February 20, 2026

బంగ్లాకు వీసా సర్వీసుల పునరుద్ధరణ

image

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నిరకాల వీసా సర్వీసుల పున:ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ రీఓపెన్ అయ్యింది. త్వరలోనే IND కూడా సర్వీసులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. బంగ్లాలో హాదీ హత్యతో అల్లర్లు చెలరేగడం, అక్కడి హిందువులపై దాడితో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

News February 20, 2026

నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

image

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.