News February 3, 2025

కల్వకుర్తి: కీలక కమిటీలో వంశీచంద్ రెడ్డికి చోటు

image

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది బృంద సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.

Similar News

News November 4, 2025

టీ/కాఫీ తాగకపోతే హెడేక్ ఎందుకు వస్తుందంటే?

image

అనుకోకుండా టీ/కాఫీ మానేస్తే చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. దీనిపై డాక్టర్ సుధీర్ కుమార్ వివరణ ఇచ్చారు. ‘కాఫీ తాగకపోతే తలనొప్పి రావడం ఊహ కాదు. అది కెఫీన్ విత్‌డ్రాయల్ లక్షణం. అడెనోసిన్ అనే నిద్రమత్తు రసాయనాన్ని కెఫీన్ అడ్డుకుంటుంది. అకస్మాత్తుగా కాఫీ/టీ మానేస్తే అడెనోసిన్ మెదడులోకి వెళ్లి రక్తనాళాలు విస్తరిస్తాయి. దీంతో తలనొప్పి, అలసట, చిరాకు వంటివి కనిపిస్తాయి’ అని తెలిపారు.

News November 4, 2025

పిల్లలను జర్మనీకి పంపిస్తున్నారా?

image

జర్మనీకి వెళ్తే సెటిల్ అయిపోవచ్చని అనుకుంటున్న వారికి అక్కడి NRIలు కీలక సూచనలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని ఉద్యోగాలు లేక చాలామంది వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. ‘కేవలం ఇక్కడి NRIలు చేసే రీల్స్ చూసి గుడ్డిగా రావద్దు. కనీసం 10 మంది అభిప్రాయాలు తీసుకోండి. జర్మన్ భాష నేర్చుకోగలిగితే ఇక్కడ స్థిరపడటం సులభం. కష్టపడటానికి సిద్ధమైతేనే ఈ దేశాన్ని ఎంచుకోండి’ అని సూచిస్తున్నారు.

News November 4, 2025

NZB: డాక్టర్, రియల్టర్ వేధిస్తున్నారని మహిళ ఫిర్యాదు

image

NZB నగరానికి చెందిన ఓ ప్రముఖ డెంటల్ వైద్యుడు, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఓ మహిళ ఆరోపించింది. తనకు వీడియో కాల్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు సోమవారం CP సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేట్ సంస్థలో పని చేసేదాన్నని, వారి వేధింపులు తాళలేక రెండేళ్ల క్రితం జాబ్ మానేసినట్లు చెప్పింది. తరుచూ ఫోన్లు చేసి వేధిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు.