News February 2, 2025

కల్వకుర్తి: కునుకు తీసిన గుడ్లగూబ

image

కల్వకుర్తి పట్టణం గాంధీనగర్ కాలనీ‌లోని ఓ దుకాణం వద్ద ఓ గుడ్లగూబ ఆదివారం కునుకు తీస్తూ కనిపించింది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిద్రపోతున్న గుడ్లగూబను కాలనీ ప్రజలు, అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకించారు. అడవిలో ఉండే ఈ పక్షి కాంక్రీట్ జంగిల్‌గా మారిన పట్టణంలో కునుకు తీస్తూ కనిపించటంతో ఆసక్తి నెలకొంది. ఈ గుడ్లగూబను పలువురు కెమెరాలో బంధించారు.

Similar News

News September 18, 2025

స్వచ్ఛతా హీ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టబోయే స్వచ్ఛతా హీ సేవా 2025 వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలెక్టరేట్‌లో బుధవారం ఆవిష్కరించారు. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో జిల్లా ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామ పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

News September 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤ టెక్కలి, జలుమూరు, పాతపట్నం, పొందూరు, శ్రీకాకుళానికి నూతన ఎంపీడీఓలు
➤అరసవల్లి: ఘనంగా ఆదిత్యుని కళ్యాణం.
➤అధ్వానంగా ముంగెన్నపాడు రోడ్డు.
➤ శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల విశ్వకర్మ జయంతి.
➤నరసన్నపేట: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
➤ఇచ్ఛాపురంలో గంజాయితో ఇద్దరు అరెస్ట్.
➤శ్రీకాకుళం: వైసీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం
➤ మా శత్రువు టీడీపీనే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

News September 18, 2025

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో రేపటి నుంచి వందే భారత్ హాల్టింగ్: శ్రీధర్

image

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో రేపటి నుంచి వందే భారత్ రైలు హాల్టింగ్ ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ.శ్రీధర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి ప్రతిరోజు మ.3:15 గంటలకు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ ఉండనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేశ్ సికింద్రాబాద్-నాగపూర్ వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు.