News March 30, 2025
కల్వకుర్తి యువతికి గ్రూప్ 1లో 45వ ర్యాంకు

కల్వకుర్తి పట్టణానికి చెందిన యువతి గ్రూప్ 1లో 45వ ర్యాంకు సాధించింది. మెడిసిన్ పూర్తి చేసిన సాహితి ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమైంది. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1 సాధించిన ఆమెను పలువురు అభినందించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా సాహితి మాట్లాడుతూ ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని అన్నారు.
Similar News
News April 1, 2025
కాకాణికి చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన హైకోర్టు

AP: వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి ఆయనకు ఉపశమనం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. తనపై పోలీసులు <<15956367>>అక్రమ కేసులు<<>> నమోదు చేస్తున్నారని, కేసులు క్వాష్ చేయాలని, బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
News April 1, 2025
కర్నూలు: సెక్షన్ 11 నోటీస్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు- సబ్ కలెక్టర్

రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లో 9(2) నోటీసులోని విస్తీర్ణంపై అభ్యంతరాలు ఉంటే సెక్షన్ 11 నోటీస్ ద్వారా మొబైల్ మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయవచ్చునని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని మండలంలోని పైలట్ గ్రామంగా ఎన్నికైన పెసలబండ గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించి, రైతులకు 9(2) నోటీసులు అందజేశారు. గ్రామంలో మొత్తం 1591.58 ఎకరాలు, 474 ఖాతాలు ఉన్నాయన్నారు.
News April 1, 2025
సిద్దిపేట: 48 మంది ఈవ్టీజర్లపై కేసులు

48 మంది ఈవ్టీజర్లపై కేసులు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో గుర్తించిన 36 హాట్ స్పాట్స్ వద్ద క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో 48 మంది ఈవ్ టీజర్లను పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించామని, కేసులు నమోదు చేశామని తెలిపారు. మహిళలు మౌనం వీడి వేధింపులపై ఫిర్యాదు చేయాలని సూచించారు.