News December 8, 2025

కల్వకుర్తి: 40 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం

image

కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. కాలనీకి చెందిన పూజారి శ్రీనివాస శర్మ ఇంట్లో దొంగలు దోపిడీకి పాల్పడి 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఆరు లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. ఈనెల 30న కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వెళ్లిన ఆయన సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News December 10, 2025

కుందేళ్ల పెరుగుదలకు మేలైన ఆహారం

image

పుట్టిన 12 రోజుల తర్వాత నుంచి కుందేలు పిల్లలు ఆహారం తింటాయి. కుందేళ్లకు గడ్డితో పాటు దాణాలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ చెక్క, తవుడు, లవణ మిశ్రమాలు తగిన పరిమాణంలో కలిపి మేతగా అందించాలి. లూసర్న్, బెర్సీమ్, నేపియర్, పారాగడ్డి, వేరుశనగ, చిక్కుడు, సోయా, పిల్లిపెసర ఆకులను మేతలో కలిపి ఇవ్వవచ్చు. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. నీటిని అందుబాటులో ఉంచాలి.

News December 10, 2025

రాష్ట్రంలో పరువు హత్య!

image

TG: హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో పరువు హత్య కలకలం రేపింది. బీటెక్ స్టూడెంట్ శ్రవణ్ సాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు. అది ఇష్టం లేని యువతి పేరెంట్స్ అతడిని నిన్న హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. అనంతరం సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వారే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 10, 2025

ములుగు జిల్లాలో మొదటి విడత ఎన్నికల సమాచారం

image

జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మూడు మండలాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్పంచ్ స్థానాలు: 39
అభ్యర్థులు: 139
వార్డు స్థానాలు: 287
అభ్యర్థులు: 532
ఓటర్ల సంఖ్య: 68,303
పోలింగ్ కేంద్రాలు: 379
ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
పీవోలు(పోలింగ్ అధికారులు): 525 మంది
ఉప పీవోలు: 652 మంది