News December 13, 2025

కశింకోట: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య.. యాక్సిడెంట్‌గా చిత్రీకరణ

image

కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన అనుమానాస్పద మృతి మిస్టరీని పోలీసులు చేధించారు. K.నారాయణమూర్తి (54)ని అతని బంధువులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించారు. మృతుడి పేరుమీద ప్రధాన నిందితుడు ఎస్.అన్నవరం రూ.కోటి వరకు ఇన్సూరెన్స్ చేయించారు. ఈ నేరంలో మరో ఇద్దరితో పాటు LIC ఏజెంట్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Similar News

News December 22, 2025

రెండో పెళ్లిపై మారుతున్న దృక్పథం

image

భారతీయుల్లో రెండో పెళ్లిపై అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి. రీబౌన్స్ మ్యాచ్‌మేకింగ్ యాప్ నిర్వహించిన తాజా సర్వేలో విడాకులు తీసుకున్న వారిలో 28% మంది మళ్లీ పెళ్లికి సిద్ధమని వెల్లడించారు. గతం తమ భవిష్యత్తును డిసైడ్‌ చేయకూడదని వారు భావిస్తున్నారు. ఈ మార్పులో మహిళలే ముందుండటం గమనార్హం. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ఆలోచనా ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. సమాజంలో మారుతున్న ఈ ఆలోచనా విధానంపై మీ Comment?

News December 22, 2025

ఏర్పేడు: ముగిసిన ఇంటర్ స్పోర్ట్స్ మీట్.!

image

తిరుపతి IIT వేదికగా జరుగుతున్న 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ముగిసింది. ఐఐటీ మద్రాస్ కార్పొరేట్ రిలేషన్స్ డీన్ అశ్విన్ మహాలింగం అతిథిగా హాజరయ్యారు. విజేతలు వీరే:
> చెస్ విజేత : IIT బాంబే రన్నర్ : మద్రాస్
> మహిళల టెన్నిస్ విజేత : IIT మద్రాస్ రన్నర్ : ఢిల్లీ
> పురుషుల టెన్నిస్ విజేత : IIT మద్రాస్ రన్నర్ : కాన్పూర్
> వెయిట్ లిఫ్టింగ్టీం ఛాంపియన్ : IIT రూర్కీ.

News December 22, 2025

తిరుపతి: ‘కరంటోళ్ల జనబాట’కు ఏపీఎస్పీడీసీఎల్ శ్రీకారం

image

ఏపీఎస్పీడీసీఎల్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా సీఎండీ శివశంకర్ ‘కరంటోళ్ల జనబాట’ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 22వ తేదీన పాకాల మండలంలో మంత్రి రవికుమార్ దీనిని ప్రారంభించనున్నారు. విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.