News April 13, 2024
కాంగ్రెస్కు ఓటేసినా.. BRSకు వేసినా మురిగిపోయినట్లే: DK అరుణ

CM రేవంత్రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. పాలమూరు బిడ్డగా ఆయన జిల్లాకు ఏం చేశారో చెప్పాలని DK అరుణ అన్నారు. బూత్స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘జిల్లాకు సాగునీరు కోసం ఉమ్మడి రాష్ట్రంలో నేను కొట్లాడా. ఎంపీగా రేవంత్ ఏనాడూ ఈ జిల్లాపై మాట్లాడలేదు. ఆరు గ్యారంటీలు అమలు కావు.. 17సీట్లు గెలిచినా రాహుల్ ప్రధాని కారు. BRSకు ఓటేసినా.. కాంగ్రెస్కు వేసినా మురిగిపోయినట్లే’ అని అన్నారు.
Similar News
News April 22, 2025
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
News April 22, 2025
రైతుల దగ్గరికే అధికారులు: కలెక్టర్ విజయేంద్ర

మే1 నుంచి ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా భూభారతి చట్టం కింద వివరాలను డిజిటలైజేషన్ చేస్తారని అన్నారు. అడ్డాకులలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ పోర్టల్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
News April 22, 2025
MBNR: వేసవి కరాటే శిక్షణ శిబిరం

వేసవి కరాటే శిక్షణ శిబిరానికి సద్విని చేసుకోవాలని ఉమ్మడి ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ పి వెంకటేష్ కోరారు. వారు కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ.. విద్యార్థులు యువత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. మార్షల్ ఆర్ట్స్ తో శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగవచ్చు అన్నారు. ఈ శిక్షణ శిబిరం ఏప్రిల్ 30 నుంచి జూన్ 11 వరకు నిర్వహిస్తున్నామన్నారు.